మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

by Dishanational2 |
మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చావు పుట్టుకలు అనేవి సహజం. పుట్టిన ప్రతీ జీవి మరణించడం సహజం. అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది. మన ఆత్మ మ వాళ్లవద్దనే ఉంటుందా.. ఇలా పలురకాల అనుమానాలు ఉంటాయి. కాగా, ఈ విషయంపైన అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన డేవిడ్ హాంజల్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకున్నానంటూ అందరినీ ఆశ్చర్యపరస్తున్నాడు.

అనారోగ్య సమస్యలతో ఆయన రెండు నెలలపాటు కోమాలో ఉన్నాడంట. ఆ టైంలోనే చావు అంచులలో ఉండే అనుభవం ఆ సమయంలోనే నేను మరణాంతర జీవితంలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. అనారోగ్యంగా ఉన్న సమయంలోనే తాను కన్నుమూశానని మరుక్షణమే తన కళ్ళు తెరుచుకున్నాయని అప్పుడే మరణాంతర జీవితాన్ని చూసే అవకాశం దక్కింది అన్నాడు. చనిపోయిన తర్వాత జీవితంలో కనిపించే ఇలాంటి అందమైన వాతావరణం లో తనని ఇద్దరు గైడ్ చేశారని డేవిడ్ చెప్పాడు. ఆ ఇద్దరు తనకు అందమైన బంగారు వర్ణం కాంతిని చూపించారని అన్నారు.

Read More: సోషల్ మీడియాలో ‘బాడీ ఇమేజింగ్’ ట్రెండ్స్... పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్

Next Story